పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దూసుకెళ్లింది. మొత్తం 144 సీట్లకు ఎన్నికలు జరిగితే, మమత నేతృత్వంలోని తృణమూల్ ఏకంగా 134 సీట్లను కైవసం చేసుకుంది. ఇక స్వతంత్రంగా గెలుపొందిన వారు కూడా తృణమూల్కే మద్దతిస్తామని ప్రకటించారు. స్వతంత్రులతో కలిపితే తృణమూల్ 137 స్థానాలను కైవసం చేసుకున్నట్లవుతుంది. దీంతో బీజేపీకి పెద్ద శరాఘాతమనే చెప్పాల్సి వుంటుంది. మొత్తం 3 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఇక.. కాంగ్రెస్ 2 , సీపీఎం 2 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లను గెలుచుకుంటే, ఈ సారి 3 సీట్లకు మాత్రమే పరిమితమైనట్లు సమాచారం. మరోవైపు తాము కూడా తృణమూల్కే మద్దతిస్తామని, ఇలా ఇవ్వడం ద్వారా తమ వార్డుల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు.