కోల్కతా: కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమూల్ నేత ముకుల్ రాయ్ (71) గుండెపోటుతో కోల్కతాలో ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీకి సుదీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహించిన ఆయన 32వ రైల్వే మంత్రిగా 2011లో యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో పనిచేశారు. రెండుసార్లు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
1998లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ముకుల్ రాయ్ కూడా ఒకరు. అయితే పార్టీ అధినాయకత్వంతో విభేదించిన ఆయన నాలుగేండ్లు బీజేపీలో ఉండి తిరిగి టీఎంసీలో చేరారు.