కోల్కతా : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా బెంగాల్ మాజీ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ బరిలో నిలవగా విపక్షాల తరపున కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా పోటీ చేస్తున్నారు.
ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా అదేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్కు దూరంగా ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ అభ్యర్ధి మార్గరెట్ అల్వాకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.