తృణమూల్ పార్టీకి, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థకు మధయ ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని పార్టీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ విషయంలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. అవన్నీ ఊహాజనితాలని, నిరాధారమని పార్టీ తేల్చిచెప్పింది. తృణమూల్కు, పీకే నేతృత్వంలోని ఐ-పాక్కు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని, అందరం కలిసి, ఓ టీమ్గా పనిచేస్తున్నామని పేర్కొంది. మమతా బెనర్జీ నేతృత్వంలో ఐకమత్యంతో ముందుకు సాగుతామని, భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతామని పార్టీ స్పష్టం చేసింది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐపాక్ సంస్థకు, తృణమూల్కు మధ్య కాస్త వ్యత్యాసం ఉందని, వేర్వేరు దారుల్లో సాగుతున్నాయని ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పై విధంగా స్పందించింది.