న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం, 2020కి అనుగుణంగా ఉన్నత విద్యా బోధకులను తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. మాలవీయ మిషన్-టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా దేశవ్యాప్తంగా 111 సంస్థలను గుర్తించింది. వీటిని మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ (ఎంఎంటీటీసీ)లని పిలుస్తారు. వీటిలో దాదాపు 15 లక్షల మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది. మానవీయ విలువలు, నైతికత వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.ఈ శిక్షణ ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఉంటుంది. రానున్న రెండు, మూడేండ్లలో శిక్షణను పూర్తి చేయాలని యూజీసీ నిర్ణయించింది.