Ticket Checkers | టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిపై ఇద్దరు టీసీలు చేయి చేసుకున్నారు. పైబెర్తులో కూర్చున్న ఆ వ్యక్తిని కిందకు లాగి మరీ చితకొట్టారు. ముంబయి నుంచి జైనగర్ వెళ్తున్న రైల్లో దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 2న అర్ధరాత్రి ఈ ఘటన జరిగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి రైల్లో పైన ఉన్న సీట్లో కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీసీకి, సదరు ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీసీ తోటి టీసీతో కలిసి ప్రయాణికుడి కాలు పట్టుకుని బలవంతంగా కిందకు లాగుతారు. అనంతరం ఇద్దరూ కలిసి అతన్ని కాళ్లతో తంతూ తీవ్రంగా కొడతారు. టీసీల దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్ అయ్యి రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. ఘటనపై స్పందించిన ఓ అధికారి.. ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
चलती Train में जब Ticket Checkers ने यात्री को बुरी तरह से पीटा.
बिहार: ट्रेन में दो TTE ने यात्री को बेरहमी से पीटा, वीडियो वायरल होने पर रेलवे ने किया निलंबित
रेलवे अपने कर्मचारियों को थोड़ी इंसानियत सिखाए..#IndianRailways @RailMinIndia @IRCTCofficial pic.twitter.com/qDU5UlwjjI
— Harsh Wardhan Pandey (@JournoHarsh) January 6, 2023