న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం(Delhi Pollution) మళ్లీ తారా స్థాయికి చేరింది. గాలిలో ఇవాళ కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. వాయు నాణ్యత క్షీణించినట్లు అధికారులు వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో కాలుష్యం కమ్మేసింది. ఇవాళ ఉదయం నగరం అంతా పొగ చూరుకున్నట్లు మారింది. దీపావళి పటాకుల వల్ల వాయు నాణ్యత పడిపోయింది.
#WATCH | Toxic haze covers Delhi as overall air quality in ‘Severe’ category today
(Drone visuals from Signature Bridge, shot at 8.45 am) pic.twitter.com/Ef8vqmb7mg
— ANI (@ANI) November 14, 2023
ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 363గా రికార్డు అయ్యింది. వాయు నాణ్యత చాలా బ్యాడ్గా ఉన్నట్లు వెదర్ డేటా ద్వారా తెలుస్తోంది. 40 మానిటరింగ్ స్టేషన్లలో కేవలం 9 మాత్రమే డేటాను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం ఆకస్మిక వర్షం వల్ల కాలుష్యం తగ్గినా.. దీపావళి పటాకులతో మళ్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోయింది. సోమవారం రోజున ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కాలుష్యం ఉన్న నగరం ఢిల్లీగా రికార్డు అయినట్లు స్విస్ కంపెనీ ఐక్యూఎయిర్ పేర్కొన్నది. ఆ తర్వాత స్థానాల్లో పాక్లోని లాహోర్, కరాచీ ఉన్నాయి. ముంబై, కోల్కతాలు అయిదవ, ఆరవ స్థానాల్లో ఉన్నాయి.