న్యూఢిల్లీ: విమానాశ్రయంలోని టోయింగ్ వాహనానికి మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో సమీపంలోని విమానాలకు ముప్పు తప్పింది. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5.25 గంటలకు కార్గో బేలో విమానాల పార్కింగ్ కోసం వినియోగించే టోయింగ్ వాహనంలో మంటలు వ్యాపించాయి. గమనించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అదుపు చేశారు. ఆ టోయింగ్ వాహనం పలు పెద్ద విమానాల సమీపంలో ఉన్నది. మంటలను నియంత్రించడంతో సమీపంలోని భారీ కార్గో విమానాలకు ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
కాగా, టోయింగ్ వాహనంలో మంటలు వ్యాపించిన సంఘటనను ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ధృవీకరించారు. దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే విమాన కార్గో విభాగం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH Delhi: A fire incident was reported at the cargo bay of Delhi Airport at about 5:25 pm yesterday, 3rd June. A pushback towing vehicle had caught fire at the cargo bay. Soon after, firefighters were called to the location and the fire was completely brought under control. pic.twitter.com/MJSzSuMGSn
— ANI (@ANI) June 4, 2022