శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తయిబాకు చెందిన టాప్ కమాండర్ సలీం పర్రే హతమయ్యాడు. శ్రీనగర్లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మరోవైపు జమ్మూ సెక్టార్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, హెరాయిన్ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని రోజుల కిందట ఆర్నియా సెక్టార్లో ఒక చొరబాటుదారుడ్ని మట్టుబెట్టినట్లు సాంబాలోని బీఎస్ఎప్ ఐజీ డీకే బూరా తెలిపారు. పాకిస్థాన్ నుంచి జరిగే ఇలాంటి ప్రయత్నాలను తమ దళాలు ఎప్పటికప్పుడు విఫలం చేస్తాయని చెప్పారు.