Tamato | దేశంలో టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట ధర సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నది. దీంతో సామాన్యులు టమాటలు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఫలితంగా కూరల నుంచి టమాట మాయమవుతున్నది. అయితే, ఉత్తరప్రదేశ్లోని సికింద్రా మార్కెట్ కమిటీ కిలో రూ.65 చొప్పున ప్రజలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక వ్యక్తి సుమారు రెండు కిలోలు మాత్రమే విక్రయించనున్నారు. ఇందు కోసం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. మార్కెట్లో టమాట ధరలు తగ్గే వరకు స్టాల్లో విక్రయాలు కొనసాగుతాయని మార్కెట్ కమిటీ కార్యదర్శి శివకుమార్ రాఘవులు తెలిపారు.
మరో వైపు కూరగాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పప్పులు, మసాలా దినుసులు సైతం ధరలు పెరుగుతున్నాయి. దాంతో సామాన్యులపై మరింత భారంపడుతున్నది. కందిపప్పుతో పాటు జీలకర్ర, పసుపు, కారం, కొత్తమీర్లు తదితర మలాసా దినుసుల ధరలు సైతం భారీగా పెరిగాయి. పంట దిగుబడి తక్కువగా ఉండడంతో ఆయా దినుసుల ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కందిపప్పు, కాబూలీ శెనగల ధరలు భారీగా పెరిగాయని శ్రీమోతి గంజ్ ఫుడ్ కమిటీ జనరల్ సెక్రెటరీ విష్ణు అగర్వాల్ పేర్కొన్నారు. ఇంతకు ముందు పప్పుల ధరలు రూ.100-125 వరకు ఉండేవని.. ప్రస్తుతం కిలోకు రూ.140 వరకు పెరిగాయని తెలిపారు.