న్యూఢిల్లీ: విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకొనే భారతీయ విద్యార్థులకు, ఉద్యోగార్థులకు శుభవార్త! ఇంగ్లిష్ టెస్టు(టోఫెల్) రాయడం ఇకపై మరింత సులువు కానున్నది. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించనున్నారు. చిన్న రీడింగ్ సెక్షన్తో పాటు దానికి సంబంధించిన ‘ఇండిపెండెంట్ రైటింగ్’ స్థానంలో ‘రైటింగ్ ఫర్ యాన్ అకడమిక్ డిస్కషన్’ పూర్తి చేయాల్సి ఉంటుంది. భారతీయ అభ్యర్థులకు కస్టమర్ హెల్ప్ లైన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ సంస్కరణలన్నీ ఈ ఏడాది జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఈ టెస్ట్ నిర్వహించే ది ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) వెల్లడించింది.