న్యూఢిల్లీ : అమెరికా విశ్వవిద్యాలయాలు ఇక నుంచి తమ భారతీయ అధ్యయన-విదేశీ భాగస్వాముల ద్వారా టోఫెల్ పరీక్ష స్కోర్ను ధ్రువీకరించుకోవచ్చని ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) తాజాగా వెల్లడించింది. దక్షిణాసియాలో టోఫెల్, జీఆర్ఈ స్కోర్ వెరిఫికేషన్ కోసం ‘కెరీర్ మొజాయిక్’ సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఈటీఎస్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
అమెరికా విశ్వవిద్యాలయాలకు పరిపాలనా భారాన్ని తగ్గించేందుకు, విద్యార్థుల నమోదు ప్రక్రియ మరింత సమర్థంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఈటీఎస్ ఇండియా’ మేనేజర్ సచిన్ జైన్ ఈ సందర్భంగా చెప్పారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్ సహా వివిధ దేశాల్లోని వర్సిటీల్లో చేరాలనుకునే విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని కొలిచేందుకు ‘టోఫెల్’ పరీక్షను నిర్వహిస్తారు.