తిరువనంతపురం: డేకేర్ సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చిన్నారి ఒంటరిగా వెళ్లాడు. పరుగున ఇంటికి చేరుకున్న పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ డేకేర్ సెంటర్పై పోలీసులకు, చైల్డ్ హెల్ప్లైన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. వెల్లాయని ప్రాంతంలోని ప్రైవేట్ డేకేర్లో సుమారు 30 మంది పిల్లలున్నారు. రెండు రోజుల కిందట ఆ డేకేర్ సమీపంలో ఒక వేడుక జరిగింది. దీంతో డేకేర్కు చెందిన ముగ్గురు టీచర్లు పిల్లల బాధ్యతను అటెండర్కు అప్పగించి ఆ ఫంక్షన్కు వెళ్లారు. అయితే గేటు తెరిచి ఉండటంతో రెండేళ్ల బాలుడు ఆ డేకేర్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు. కిలోన్నర మీటరు దూరంలో ఉన్న ఇంటికి పరుగున చేరుకున్నాడు.
మరోవైపు తమ కుమారుడు ఒంటరిగా ఇంటికి రావడం చూసి పేరెంట్స్ షాక్ అయ్యారు. డేకేర్ సెంటర్ నుంచి ఆ బాలుడు బయటకు రావడాన్ని ఎవరూ గుర్తించకపోవడం, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతోపాటు చైల్డ్ హెల్ప్లైన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ డేకేర్ యాజమాన్యం ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసింది. దీంతో బాలుడి పేరెంట్స్ తమ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.