అయోధ్య: 500 ఏండ్ల తర్వాత మళ్లీ రామ్ లల్లా అయోధ్యకు తిరిగి వచ్చినట్లు ఆర్ఎస్ఎస్ చీఫ్(RSS Chief) మోహన్ భాగవత్ తెలిపారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ఆయన మాట్లాడుతూ ఇవాళ స్వర్ణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రామ్ లల్లాకు అనన్యమైన మర్యాద ఇస్తున్నామన్నారు. ఈ యుగానికి చెందిన చరిత్రకు చాలా శక్తి ఉందని, రామ్ లల్లా కథలు విన్నవారు తమ బాధలు, సమస్యలు నుంచి విముక్తి పొందుతున్నారని ఆయన అన్నారు. రామ్లల్లాతో పాటు భారత స్వరం కూడా తిరిగివచ్చినట్లు భాగవత్ తెలిపారు. కొత్త భారత్ ఉద్భవించిందన్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమమే దీనికి ప్రతీక అన్నారు.
#WATCH | RSS chief Mohan Bhagwat says “Today after 500 years, Ram Lalla has returned here and due to his efforts we are seeing this golden day today, we pay our utmost respect to him. The history of this era has so much power that whoever listens to the stories of Ram Lalla, all… pic.twitter.com/YkxcpvYkOo
— ANI (@ANI) January 22, 2024