న్యూఢిల్లీ: ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున ప్రిపేరయ్యారు. పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్ గ్యాస్ షెల్స్(Tear Gas Shells)ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ నుంచి వస్తున్న వేలాది మంది రైతుల్ని.. హర్యానా బోర్డర్ వద్ద ఆపేశారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఆ రైతుల్ని అడ్డుకున్నారు. రైతుల్ని చదరగొట్టేందుకు సెక్యూర్టీ టియర్ గ్యాస్ను ప్రయోగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసనకారుల్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో టియర్ గ్యాస్ షెల్స్ను తెచ్చిన పోలీసులు.. మరో 30వేల షెల్స్ కోసం ఆర్డర్ పెట్టారు. మధ్యప్రదేశ్లోని టెక్నాపూర్లో ఉన్న టియర్ స్మోక్ యూనిట్ నుంచి ఆ షెల్స్ను కొనుగోలు చేయనున్నారు. గ్వాలియర్ నుంచి ఢిల్లీకి ఆ షెల్స్ తీసుకువస్తున్నారు.