చెన్నై: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగ రాజన్ (Thiaga Rajan) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాలు ఇంధనంపై పన్నులు తగ్గించాలని అడుగుతున్నారని, మరి ఏ రాష్ట్రాన్ని అడిగే ధరలు పెంచుతున్నారని ప్రశ్నించారు. పెట్రోల్పై ట్యాక్సులు పెంచినప్పుడు ఏ రాష్ట్రాన్ని అడిగారు, కనీసం సమాచారమైనా ఇవ్వరని.. ఇప్పుడు మాత్రం వ్యాట్ను తగ్గించాలని రాష్ట్రాలను అడుగుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశించి అన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లీటరు పెట్రోల్పై రూ.23, డీజిల్పై రూ.29 పెంచిందని చెప్పారు. 2014తో పోల్చితో ఇది పెట్రోల్పై 250 శాతం, డీజిల్పై 900 శాతం అధికమని చెప్పారు. ఇప్పుడు పెంచిన ధరల్లో 50 శాతంలోపే తగ్గించి.. రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించాలంటున్నారని, పన్నులు తగ్గించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇదేమి ఫెడరలిజం అని త్యాగ రాజన్ ప్రశ్నించారు.
కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. అయితే పెరిగిన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలగాలంటే రాష్ట్రాలు కూడా పన్నుల్లో కోత విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తూ త్యాగ రాజన్ ఈ మేరకు ట్వీట్ వేశారు.
🤔The Union Government didn't INFORM, let alone ASK for ANY state's view when they INCREASED Union taxes on Petrol ~23 Rs/ltr (+250%) & Diesel ~29 Rs/ltr (+900%) from 2014
Now, after rolling back ~50% of their INCREASES, they're EXHORTING States to cut
Is this Federalism ? https://t.co/moYsfqHtdL
— Dr P Thiaga Rajan (PTR) (@ptrmadurai) May 21, 2022