కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కార్యాలయంలో హాజరు కానున్నారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఈడీ ఆయనను ప్రశ్నించనున్నది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీపై అభిషేక్ బెనర్జీ ఆదివారం మండిపడ్డారు. బెంగాల్లో ఓడిన బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను టీఎంసీపై ఉసుగొల్పుతున్నదని విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తాము ఓడించామని, ఆ పరాజయాన్ని తట్టుకోలేక కేంద్ర ఏజెన్సీలను వినియోగిస్తున్నదని ఆరోపించారు. అయితే ప్రజా శక్తి ముందు మాత్రమే తాను తల వంచుతానని, అధికారంలో ఉన్న బీజేపీకి ఎంత మాత్రం కాదని అన్నారు.
కాగా, కోల్ స్కామ్లో అభిషేక్ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజీరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. దీనిపై వారిద్దరు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. బెంగాల్కు చెందిన తమను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలంటూ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరారు. అయితే వారి అభ్యర్థనను ఈ నెల 11న ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకానున్నారు.
West Bengal | TMC MP Abhishek Banerjee to appear at ED office in Delhi tomorrow
"BJP govt is taking on TMC by using Central agencies. We've defeated them & they cannot digest this. I'm ready to bow down before the power of people but not before the people in power," he said pic.twitter.com/cHobED07Ef
— ANI (@ANI) March 20, 2022