ఆయనతో చర్చలు జరుపుతున్నాం
టీఎంసీ నేత సౌగతా రాయ్ వెల్లడి
(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి): బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్రావు కచ్చితంగా అవసరమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆంతరంగికుడు, టీఎంసీ సీనియర్ నేత సౌగతారాయ్ అన్నారు. బీజేపీపై పోరుకు తృణమూల్ కాంగ్రెస్కు తోడు గా కేసీఆరే సరైన వ్యక్తి అని తమ పార్టీలోని ఒక వర్గం బలంగా విశ్వసిస్తున్నదని చెప్పారు. టీఎం సీ అంతర్గత సమావేశాల్లోనూ తాము ఈ అం శంపై చర్చిస్తామని చెప్పారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. ‘ఈడీ, సీబీఐ సహకారంతో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని చూస్తున్న బీజేపీ పొలిటికల్ గేమ్ను కేసీఆర్ పూర్తిగా అవగతం చేసుకొన్నారని టీఎంసీలోని ఇంకో వర్గం కూడా అభిప్రాయపడుతున్నది.
అందుకే ఐకమత్యంగా ఉండాల్సిన సమయం ఇదే అని వారు అంటున్నారు’ అని తెలిపారు. కేసీఆర్ తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నామని, రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ రావటమే గ్రీన్ సిగ్నల్గా భావిస్తున్నామని వెల్లడించారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక గ్రూప్ ఏర్పాటు అవసరాన్ని టీఆర్ఎస్, కేసీఆర్ అర్థం చేసుకొన్నారని పేర్కొన్నారు.