కోల్కతా : గవర్నర్లు కాషాయ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారాయని విపక్షాలు ఆరోపిస్తున్న నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్పై టీఎంసీ (TMC) తీవ్ర విమర్శలు గుప్పించింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఆరోపించారు.
గవర్నర్ తీరు అభ్యంతరకరమని ఆయన ఆక్షేపించారు. బోస్ గవర్నర్ పదవిని అడ్డుపెట్టకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ నివాస నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఆరోపణలు వాస్తవామా కాదా అనేది విచారణ చేపట్టి నిగ్గుతేల్చాలని కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. ఇక బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ వ్యవహారశైలిపై సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని పాలక టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
Read More :