కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత పోరు మరింత ముదిరింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం శుక్రవారం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పార్టీ పేరు, గుర్తు తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యాలయం 2022 నుంచి పార్టీ ప్రధాన కార్యాచరణ కేంద్రంగా నడుస్తోంది.
శుక్రవారం సీనియర్ నేతలు ఫిర్హాద్ హకీమ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అఖ్రుజ్జమాన్లతో కలసి రితబ్రత బెనర్జీ ఈ కార్యాలయాన్ని సందర్శించారు. భవన యజమానులతో అవసరమైన ఒప్పందాలను పూర్తి చేశామని, ఇకపై తాము ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తామని తిరుగుబాటు నేతలు స్పష్టం చేశారు. కాగా ఈ ముట్టడిని మమతా బెనర్జీ వర్గానికి చెందిన నేతలు మదన్ మిత్రా, కునాల్ ఘోష్ ఖండించారు.