TMC Minister : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీపై టీఎంసీ మంత్రి శశి పంజా స్పందించారు. రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు తాము కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని అన్నారు. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ సారధ్యంలో రైతుల ఆదాయం రెట్టింపైందని వెల్లడించారు. కానీ కేంద్ర ప్రభుత్వ హామీ మాత్రం నెరవేరలేదని, అది హామీ గానే మిగిలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో అత్యంత సంపన్నుల రుణాలు మాత్రం రూ. 14.5 లక్షల కోట్లు మాఫీ చేశారని, రైతుల రుణాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయలేదని మండిపడ్డారు. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని దీనికి బాధ్యులు ఎవరని ఆమె ప్రశ్నించారు. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారని ఆమె కేంద్రాన్ని నిలదీశారు.
రైతుల వేదనను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిరసనల్లో రైతులు మరణిస్తున్నారని, అయినా మోదీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదని టీఎంసీ మంత్రి శశి పంజా పేర్కొన్నారు.
Read More :