కోల్కతా: కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దూసుకెళ్లుతోంది. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో ఇప్పటికే ఆ పార్టీ 17 సీట్లను కైవసం చేసుకున్నది. కేఎంసీలో మొత్తం 144 సీట్లు ఉన్నాయి. ఆదివారం ఆ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీదీ పార్టీ 117 సీట్లలో లీడింగ్లో ఉంది. కోల్కతా మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ చేతులెత్తేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 2 సీట్లు దక్కినట్లు తెలుస్తోంది. మరో 3 సీట్లలో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ కేవలం రెండు వార్డుల్లో లీడింగ్లో ఉంది. తృణమూల్ అభ్యర్థి.. మమతా బెనర్జీ మేన కోడలు కజారి బెనర్జీ 73వ వార్డు నుంచి మూడు వేల ఓట్లతో ఆధిక్యంలో ఉంది. మరోవైపు సీఎం మమతా ఇంటి ముందు సంబరాలు మొదలయ్యాయి. టీఎంసీ కార్యకర్తలు రంగులకేళీలో మునిగిపోయారు.