న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగిన టీ ఎంసీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మం గళవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద వారు తమ నిరసనను కొనసాగించారు. ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఐటీ విభాగాలకు అధిపతులను మార్చాలని డిమాండ్ చేస్తూ టీఎంసీ నేతలు సోమవారం ఈసీ ఫుల్ బెంచ్ను కలిశారు. అనంతరం ఈసీ కార్యాలయం ఎదుట 24 గంటల పాటు ధర్నాకు దిగారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి విడుదల చేశారు. అయినప్పటికీ వా రం తా పోలీస్స్టేషన్లోనే ఉండి ధర్నా కొనసాగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్కు టీఎంసీ నేతలు మంగళవారం లేఖ రాశారు.