కోల్కతా: 2022లో పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ని భూపతినగర్లో జరిగిన పేలుడు సంఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం ఎన్ఐఏ పంపిన సమన్లను 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేత లు పట్టించుకోలేదని అధికార వర్గా లు వెల్లడించాయి. వారికి మరోసారి సమన్లు పంపే అవకాశమున్నట్టు తె లుస్తున్నది. మార్చి 28న న్యూటౌన్లోని ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని సమన్లు పంపగా వారు లెక్క చేయకపోవడంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ అధికారుల ముందు హాజరుకావాలని ఎన్ఐఏ కోరింది. అయినప్పటికీ వారు హాజరు కాలేదు.