కోల్కతా: ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు టీఎంసీ నాయకుడు బాబుల్ సుప్రియో తెలిపారు. దీని కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా పత్రం అందజేసేందుకు సమయం కోరుతూ శుక్రవారం లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి అయిన బాబుల్ సుప్రియో ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. బీజేపీ తరుఫున అసన్సోల్లో పోటీ చేసి గెలిచిన ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా అపాయింట్మెంట్ కోరినట్లు బాబుల్ సుప్రియో శనివారం వెల్లడించారు.