కోల్కతా: మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్(Yusuf Pathan).. బెంగాల్లోని బెర్హమ్పోర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ టికెట్పై పోటీ చేయనున్నారు. అయితే ఇవాళ ఆ నియోజకవర్గంలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఫీల్డ్ చాలా భిన్నమైందని, కానీ ప్రజల ఆశయాలు అలాగే ఉంటాయన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. 2007 వరల్డ్కప్లో ఆడినప్పుడు ఎంత సంతోషం ఉందో, ఇప్పుడు కూడా ఆ ఉత్సాహంతోనే ఉన్నట్లు పఠాన్ తెలిపారు. గుజరాత్ తనకు జన్మభూమి అని, బెంగాల్ కర్మభూమి అన్నారు. బెర్హమ్పోర్ నుంచి గతంలో అయిదు సార్లు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.
#WATCH | Murshidabad, West Bengal: Yusuf Pathan, former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore says, “I am grateful to Mamata Didi (CM Mamata Banerjee) for giving me the opportunity to serve you. I hope that the way you people have given me love for the… pic.twitter.com/N7ihjlPXhU
— ANI (@ANI) March 21, 2024