పనాజీ: ఓ చేతిని, రెండు కాళ్లను కోల్పోయిన దివ్యాంగుడు టింకేష్ కౌశిక్ (30) ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్పైకి చేరుకుని రికార్డు సృష్టించారు. కౌశిక్ తొమ్మిదేళ్ల వయసులో హర్యానాలో విద్యుదాఘాతానికి గురయ్యారు.
దీంతో ఓ చేతిని, రెండు కాళ్లను కోల్పోయారు. ఆయన కృత్రిమ అవయవాలను వాడుతున్నారు. ప్రస్తుతం గోవాలో ఆయన ఫిట్నెస్ ట్రైనర్గా పని చేస్తున్నారు.