న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్(Tim Cook).. ఇవాళ ఢిల్లీలో రిటైల్ స్టోర్ను ఓపెన్ చేశారు. సాకేత్లో ఉన్న వాక్ మాల్లో యాపిల్ రిటైల్ సెంటర్ను ప్రారంభించారు. ఓపెనింగ్ సందర్భంగా భారీ సంఖ్యలో జనం స్టోర్కు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన కస్టమర్లతో టిమ్ కుక్ మాట్లాడారు. ఓ చిన్నారితోనూ టిమ్ ఫోటో దిగారు.
#WATCH | Apple CEO Tim Cook meets customers visiting India’s second Apple Store at Delhi's Select City Walk Mall in Saket. pic.twitter.com/ZeEubKU92w
— ANI (@ANI) April 20, 2023
ఈనెల 18వ తేదీన ముంబైలోనూ రిటైల్ స్టోర్ను టిమ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ముంబైలో జియో వరల్డ్ డ్రైవ్ స్టోర్తో పోలిస్తే ఢిల్లీ స్టోర్ చాలా చిన్నది. ఢిల్లీలోని సాకేత్ స్టోర్..ముంబై స్టోర్లో సగం ఉంటుందట. అక్కడ నెలకు కిరాయి రూ. 40 లక్షలు.
సాకేత్ స్టోర్లో మొత్తం 70 మంది రిటైల్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఆ ఉద్యోగులు 18 రాష్ట్రాలకు చెందినవాళ్లు. 15 భాషలు మాట్లాడగలరు. ప్రధాని మోదీతో ఐఫోన్ ఉత్పత్తి గురించి టిమ్ చర్చించారు.