డెహ్రాడూన్: ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ గణాంకాల ప్రకారం కేదార్నాథ్ ధామ్ మార్గంలో అత్యధికంగా 96 మరణాలు నమోదయ్యాయి. యమునోత్రి ధామ్లో 34, బద్రీనాథ్ ధామ్లో 33, గంగోత్రి ధామ్లో 29, హేమకుండ్ సాహిబ్లో ఏడుగురు, గౌముఖ్ ట్రెక్లో ఒకరు మరణించారు. ఆరోగ్య సమస్యలతో పాటు బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చార్ధామ్ యాత్రకు సుమారు 42 లక్షల మంది, ప్రధానంగా కేదార్నాథ్ ధామ్కు 13.4 లక్షల మంది యాత్రికులు పొటెత్తినట్లు వెల్లడించారు.
కాగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 11 వరకు 232 మంది యాత్రికులు మరణించారు. కేదార్నాథ్ ధామ్లో 111 మంది, బద్రీనాథ్ ధామ్లో 58 మంది, హేమకుండ్ సాహిబ్లో నలుగురు, గంగోత్రి ధామ్లో 15 మంది, యమునోత్రి ధామ్లో 44 మంది చనిపోయారు. గత ఏడాది చార్ధామ్ యాత్ర మొత్తంలో 300కుపైగా యాత్రికులు మరణించారు.