న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఏర్పడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారత్, చైనా మధ్య సత్సంబంధాలు ఇరు దేశాలకేగాక, ప్రపంచానికి చాలా ముఖ్యమైనవని అన్నారు. ‘న్యూస్వీక్’ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా సరిహద్దు వివాదం వెంటనే కొలిక్కి రావాలన్నారు. ఇరు దేశాల మధ్య సానుకూలమైన దౌత్య, మిలటరీ స్థాయి చర్చలు జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. మోదీ వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తున్నదని చైనా అధికార ప్రతినిధి మావో నింగ్ అన్నారు. బలమైన, స్థిరమైన సంబంధాలు ఇరు దేశాల ప్రయోజనాల్ని నెరవేర్చుతాయని ఆమె చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం మన బలగాలు ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.