న్యూఢిల్లీ: భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఇవాళ ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu).. 75 ఏళ్ల సంస్మరణ పోస్టేజ్ స్టాంప్ను, ఓ నాణాన్ని రిలీజ్ చేశారు. ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆమె ప్రసంగించారు. గత కొన్నేళ్ల నుంచి సమాజంలో అన్ని రంగాల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం గురించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు. పేదలకు ఇండ్లు లభిస్తున్నాయని, దేశంలో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాల కల్పన జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.
President Droupadi Murmu addresses the joint sitting of both Houses of Parliament on Constitution Day
The President says, “Our Constitution is a living and progressive document. Through our Constitution, we have achieved the goals of social justice and inclusive development…” pic.twitter.com/ZLhisFRm4Q
— ANI (@ANI) November 26, 2024
మన రాజ్యాంగం సజీవమైన, ప్రగతిశీల పత్రం అని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం, సమత్ర అభివృద్ధి లాంటి లక్ష్యాలను అందుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది వెల్లడించారు. గత కొన్నాళ్లుగా అనేక కీలకమైన మార్పులు జరిగాయని, జీఎస్టీతో పాటు భారతీయ న్యాయ సంహిత అమలు జరిగినట్లు చెప్పారు. వెనుకబడిన తరగతుల ప్రజల కోసం కూడా ప్రభుత్వం అసాధారణ రీతిలో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆరోగ్యం, ఇండ్లు, ఆహారానికి చెందిన భద్రత పేద ప్రజలకు దక్కినట్లు ఆమె వెల్లడించారు. మైథిలీ, సంస్కృత భాషల్లో కూడా రాజ్యాంగాన్ని ఆమె ఆవిష్కరించారు.
President Droupadi Murmu addresses the joint sitting of both Houses of Parliament on Constitution Day
President Murmu says “…I urge all citizens to imbibe the constitutional ideals into their behaviour and do their fundamental duties, and work towards achieving the national… pic.twitter.com/dwSq4F4oCu
— ANI (@ANI) November 26, 2024