న్యూఢిల్లీ, నవంబర్ 15: జైల్లో ఖైదీ సెల్ఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కలిగి ఉంటే అతడికి మూడేండ్ల జైలు శిక్ష విధించొచ్చని కేంద్ర ముసాయిదా చట్టం ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పరికరాలు ధరించడానికి అంగీకరించిన వారికి సెలవు ఇవొచ్చని సూచించింది. ఈ పరికరం ద్వారా అతడి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే సెలవు రద్దుతోపాటు భవిష్యత్లో సెలవు ఇవ్వకూడదని కోరింది.