Elephants | అస్సాం రాష్ట్రం గోల్పరా ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి వచ్చిన గజరాజుల గంపు రహదారిపై వెళ్తున్న ప్రయాణికులపైకి దూసుకొచ్చి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
గోల్పరా ప్రాంతంలో గురువారం అటవీ ప్రాంతంలోని రహదారిపైకి వచ్చిన ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ద్రుబదత్త తెలిపారు. ఏనుగుల దాడిలో రెండు వాహనాలు సైతం పూర్తిగా ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు.
Assam | Three people including a child were killed and two others injured after they were attacked by wild elephants in Goalpara today, says Dhruba Dutta, Forest Range Officer, Lakhipur.
Two vehicles were also damaged in the incident, the official adds. pic.twitter.com/PctllBPzjx
— ANI (@ANI) December 15, 2022