ముంబై : మహారాష్ట్రలోని ధూలేలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.