సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): విరాళంగా 10 అంబులెన్స్లు అందించింది ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈవో, ఎండీ రమేశ్ బాబు మాట్లాడుతూ..కరోనా సెకండ్ వేవ్తో రాష్ట్రంలో వైద్య సేవలకోసం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం ప్రత్యక్షంగా చూశాను..అందుకే ఇక్కడ అత్యవసర వైద్య సాయం అందించేందుకు సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ తరుఫున 10 అంబులెన్స్లను ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఇందుకోసం రూ.1.77 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు.