భవానీపట్నం, మే 9: ఒడిశాలోని కలహండి అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. డీఎస్పీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారి ఒకరు గాయపడ్డారు. తపరెంజ్, లుదెన్గార్ రిజర్వ్ ఫారెస్ట్లో మంగళవారం ఉదయం పోలీస్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా, ఎన్కౌంటర్ జరిగిందని ఒడిశా డీజీపీ సునీల్ కే బన్సాల్ వెల్లడించారు.
ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరణించిన మావోయిస్టుల్లో ఏరియా కమిటీ సభ్యుడు ఉన్నట్టు తమకు సమాచారముందని అన్నారు.