ముంబై, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఒక బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులు ఆమెను ఐదు రోజులు అడవిలో బంధించి గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలో జరిగింది. అహల్యానగర్ జిల్లాలోని రాహురికి చెందిన 15-16 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెను నాసిక్లోని రాంషేజ్కోట సమీపంలోని అడవిలో ఐదు రోజుల పాటు బంధించి పదేపదే లైంగిక దాడి చేశారు.
పోలీసులు ఆ బాలికను రక్షించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సాంకేతికత ఆధారంగా రాహురి పోలీసులు ఈ నెల 18న ఆ ప్రాంతాన్ని గుర్తించి బాలికను రక్షించారు.