Santosh Ahlawat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే తృత్వంలోని బీజేపీకి ఓటేయనివారు.. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని ఆ పా ర్టీ మాజీ ఎంపీ సంతోశ్ అహ్లావత్ అన్నా రు.ఈ మేరకు శనివారం ఝున్ఝునూ లోని సూరజ్ఘర్లో జరిగిన బూత్లెవ ల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
‘మోదీకి ఓటేయని ప్రభుత్వ ఉద్యోగులు కొలువులను వదిలేయండి. సూరజ్ఘర్లోని సర్కారీ కార్యాలయాల్లో కూర్చు నే అర్హత వారికి లేనేలేదంటూ ఆమె బెదిరింపులకు దిగారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్న బీజేపీ వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.