భోపాల్: ఒక బాలుడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చాక్లెట్లను దొంగించిందని, ఆమెను జైలులో పెట్టాలంటూ అమాయకంగా చెప్పాడు. మధ్యప్రదేశ్లోని బుధన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డెడ్తలై గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు ఇటీవల తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననీయడం లేదని, తనను కొడుతున్నదని ఆ బుడతడు ఆరోపించాడు. ‘అమ్మ నా చాక్లెట్ దొంగిలించింది. ఆమెను జైలులో పెట్టండి’ అని అమాయకంగా ఫిర్యాదు చేశాడు.
కాగా, ఎస్ఐ ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా బాలుడ్ని నమ్మించారు. తన తల్లిపై ఆ బుడతడు చేసిన ఆరోపణలను అందులో నమోదు చేసింది. అనంతరం ఆ బాలుడికి ఆమె నచ్చజెప్పారు. అతడి తల్లి మంచిదని, అతడి మంచి కోసమే ఆమె అలా చేస్తున్నదని చెప్పి ఇంటికి పంపారు. బాలుడి ఫిర్యాదుపై తామంతా నవ్వుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు తమ కుమారుడికి స్నానం చేయించిన తర్వాత అతడి తల్లి కాటుక పెడుతుండగా చాక్లెట్ కోసం మారం చేయడంతో ఆమె కొట్టిందని బాలుడి తండ్రి తెలిపాడు. దీంతో ఏడ్చిన అతడు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మారం చేయడంతో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. కాగా, ఆ బుడతడు తన తల్లి గురించి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://dainik-b.in/zlj8lRQTbub