ముంబై: నటి జియాఖాన్ (Jiah Khan) ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్ పంచోలీ (Suraj Pancholi) ని ఇవాళ ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై జియా తల్లి రబియాఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నా బిడ్డ ఆత్మహత్య కాదని, హత్య చేశారని, దీనిపై తాను మరోసారి హైకోర్టుకు వెళ్తానని ఆమె చెప్పారు.
జియాఖాన్ 2013 జూన్ 3న ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా సూరజ్ పంచోలీ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేయడం, జియా తల్లి రబియా మాత్రం తనబిడ్డది ఆత్మహత్య అని వాదించడం కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగింది.
2019లో ఈ కేసు విచారణ ప్రారంభం కాగా.. పరిమిత సాక్ష్యాధారాల కారణంగా సూరజ్ను దోషిగా పేర్కొనలేమని, నిర్దోషిగా ప్రకటిస్తున్నామని కోర్టు పేర్కొంది. సూరజ్ పంచోలీ తన బిడ్డను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని కోర్టు తేల్చిందని, మరైతే నా బిడ్డ ఎలా చనిపోయిందని ఆమె ప్రశ్నిస్తున్నారు.