Kapil Sibal | ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ప్రతిపక్ష నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్యానికి, దేశ పౌరులకు ఆశాకిరణమని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. బీజేపీని సంపన్నం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. అయితే, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో గత కొన్నేళ్లలోనే బీజేపీకి ఐదు నుంచి ఆరువేల కోట్ల విరాళాలు వచ్చాయి. వేలకోట్లలో విరాళాలుంటే రాజకీయ పార్టీ మౌలిక సదుపాయాలను సృష్టించుకోవచ్చన్నారు.
దేశవ్యాప్తంగామన సొంత కమ్యూనికేషన్ నెట్వర్క్ని సృష్టించుకోవచ్చన్నారు. ఈ నిధులతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూరిందో తెలిసిపోతుందన్నారు. పెద్ద మొత్తంలో ఎలాంటి ప్రయోజనం లేకుండా ఖర్చు చేయరని.. ఎవరూ డబ్బులు ఇవ్వరన్నారు. ఎలక్టోరల్ బాండ్లలో రూ.10-15లక్షలు ఇవ్వరని.. కోట్లలోనే ఉంటుందన్నారు. రాజకీయ పార్టీకి రూ.5వేలకోట్ల నిధులు ఇస్తున్నారంటే ధనికులు మాత్రమే ఫండింగ్ చేశారని.. వారి ఎంతోకొంత ప్రతిఫలంగా ఉంటాయని ఊహించవచ్చన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు వస్తాయన్నారు. స్కామ్ ఎక్కడ ఉందో ప్రధాని చెబుతూనే ఉన్నారని.. అయితే మోదీ ఎక్కడున్నారో ఆయన కళ్ల ముందే స్కామ్ జరుగుతుందని.. ఇది ప్రభుత్వ మోసమని విమర్శించారు.