గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ చిత్రం జరిగింది. గెలిచిన వాళ్లు యమ సంతోషంలో ఉంటే.. ఓడిపోయిన అభ్యర్థులు తెగ బాధపడుతున్నారు. ఈ ఘటన అత్యంత సహజం. కానీ ఓ విచిత్రమేమంటే.. ఓ అభ్యర్థి ఇంట్లో మొత్తం 12 మంది కుటుంబ సభ్యుల ఓట్లుంటే.. కేవలం ఒకే ఒక్క ఓటు పడింది. అది కూడా ఆయనదే. దీంతో ఆ అభ్యర్థి పరిస్థితి ఏమిటో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ ఘటన గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగింది. సంతోశ్ హల్పాతీ… గుజరాత్లోని ఛర్వాలా గ్రామ సర్పంచ్గా బరిలోకి దిగాడు. విపరీతంగా ప్రచారం కూడా చేశాడు. ఇంటింటికీ వెళ్లి ఓట్లడిగాడు. తీరా… ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి షాక్కు గురయ్యాడు. ఆయనకు పడింది ఒకే ఒక ఓటు. కుటుంబ సభ్యులు మొత్తం 12 మంది ఉంటారు. వారెవ్వరూ ఈయనకు ఓటు వేయలేదని తెలిసిపోయింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీనిపై సంతోశ్ హల్పాతీ స్పందించాడు. ”ఎన్నికలు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కానీ నా భార్యతో సహా కుటుంబీకులెవ్వరూ నాకు ఓటు వేయలేదు. ఇదే నన్ను బాధిస్తోంది” అంటూ తెగ వాపోయాడు.