Somalian pirates : ఇటీవల అరేబియా సముద్రంలో పట్టుబడిన 35 మంది సోమాలియా సముద్ర దొంగలకు ముంబై సెషన్స్ కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ 35 మంది సముద్ర దొంగలు కొన్ని నెలల క్రితం సముద్రంలో ఓ వాణిజ్య నౌకను హైజాక్ చేసి, అందులోని 17 మంది సిబ్బందిని బంధీలుగా చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ వారిని రక్షించేందుకు INS కోల్కతాను రంగంలోకి దించింది.
దాంతో కొందరు నావికాదళ కమాండర్లను తీసుకుని ఘటనా ప్రాంతానికి చేరుకున్న INS కోల్కతా బాధితుల విడుదల కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించి మార్చి 16న వాణిజ్య నౌకలోని సిబ్బందిని విడిపించింది. అదేవిధంగా వాణిజ్య నౌకను హైజాక్ చేసిన 35 మంది సోమాలియా సముద్ర దొంగలను లొంగదీసింది.
అనంతరం సముద్ర దొంగలను, బాధితులను తీసుకుని భారత్కు బయలుదేరిన INS కోల్కతా శనివారం ముంబై తీరానికి చేరుకుంది. అనంతరం నేవీ అధికారులు 35 మంది సముద్ర దొంగలను ముంబై పోలీసులకు అప్పగించారు. ఇవాళ పోలీసులు ముంబై సెషన్స్ కోర్టులో ఆ దొంగలను హాజరుపర్చగా కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
#UPDATE | 35 Somalian pirates, who were captured by Indian Navy’s INS Kolkata on 16th March, sent to Police Custody for 10 days by Mumbai Sessions Court https://t.co/C2xmCijIA0
— ANI (@ANI) March 24, 2024