న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్వే అని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో దేశంలో తొలి ఒమిక్రాన్ కేసును గుర్తించగా, డిసెంబర్ చివరి వారానికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం కొత్త వేరియంట్వేనని వివరించారు. తదుపరి వారంలో ఇది 28 శాతానికి పెరిగిందన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్లేనని స్పష్టం చేశారు. గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య దీనికి నిదర్శమన్నారు.
మరోవైపు 18-15 ఏండ్ల పిల్లలకు సోమవారం నుంచి ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్పై వ్యక్తమవుతున్న ఆందోళనలను ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఛైర్మన్ అయిన డాక్టర్ ఎన్కే అరోరా తోసిపుచ్చారు. టీకాలు పూర్తిగా సురక్షితమన్నారు. కరోనా మహమ్మారి ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాక్సిన్లపై ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు, అధ్యయనాలు జరిగాయని చెప్పారు. వీటి ఫలితంగా వ్యాక్సిన్ జీవిత కాలం 12 నెలల వరకు మెరుగుపడిందని వివరించారు.