పుణె : దొంగలు రొచ్చిపోతున్నారు. కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ లూటీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఏటీఎంలను బద్దులు కొట్టిన దొంగలు ఇప్పుడు ఏకంగా పేలుళ్లకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలోని పుణెలో ఏటీఎంను పేల్చి వేసి.. రూ.16లక్షలతో ఉడాయించారు. ఈ ఘటన పుణెలోని చింబాలి ప్రాంతంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో చొరబడి పక్కా ప్రణాళికతో జిలెటిన్ స్టిక్స్తో మిషన్ను పేల్చివేశారు. పేలుడు ధాటికి ఏటీఎం బాగాలు ముక్కలు ముక్కలయ్యాయి. ఆ తర్వాత డబ్బును తీసుకొని నిందితులు పరారయ్యారని పింప్రి-చించ్వాడ్ పోలీస్ డీసీపీ మచంక్ ఝప్పర్ పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నిందితుల ఆనవాళ్ల కోసం సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు.