BK Hariprasad: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ బ్రిటీషర్లకు అనుకూలంగా వ్యవహరించిందని.. వాళ్ల కాలి బూట్లు నాకిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుబ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. హరిప్రసాద్ మాట్లాడుతూ… ‘భారత స్వతంత్య్ర సమరంలో సుమారు ఏడు లక్షల మంది ప్రాణత్యాగం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిలో ఈ హిందూత్వ పార్టీ నుంచి ఒక్క వ్యక్తి పేరైనా చెప్పమనండి. వాళ్లంతా బ్రిటీషర్ల బూట్లు నాకారు. అలాంటి వాళ్లు మేం టిప్పు సుల్తాన్ను ఫాలో కావాలో లేదో మరెవరిని ఫాలో కావాలో చెప్పాల్సిన అవసరం లేదు..’ అని వ్యాఖ్యానించారు.
అంతేగాక.. ‘బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాడిన వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. బ్రిటీష్కు అనుకూలంగా ఉన్నవారిని మేం వ్యతిరేకించాం. కాంగ్రెస్ను ఎవరైనా టిప్పు సుల్తాన్ వారసుల పార్టీ అని అంటే అటువంటివాళ్లు బ్రిటీషర్ల బూట్లు నాకేవారే.. అలాంటి వారి గురించి మేం పట్టించుకోం…’ అని చెప్పారు.
Former Congress MP, BK Hariprasad calls BJP a party of British Bootlickers
“Congress stands with those who fought the British during freedom struggle. We oppose those who supported the British. People labeling our Congress party as a Tipu Sultan party are British Bootlickers,… pic.twitter.com/NnLCXVtSyR
— Nabila Jamal (@nabilajamal_) December 24, 2023
కర్నాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేసే దిశగా తాము యోచిస్తున్నామని ఇటీవల సిద్ధరామయ్య వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ స్పందిస్తూ.. కర్నాటక సీఎంను ‘సెకండ్ వర్షన్ ఆఫ్ టిప్పు సుల్తాన్’ అని ఆరోపించారు. దీనికి కౌంటర్గా హరిప్రసాద్ పై విధంగా స్పందించారు. కాగా హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ ధీటుగా స్పందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ… ‘హరిప్రసాద్ బూట్స్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అతడిని బూట్ల కంటే దారుణంగా ట్రీట్ చేస్తోంది..’ అని అన్నారు.