న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శంతను సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల మధ్య మతచిచ్చు రేపి పాలన సాగిస్తున్న బీజేపీపై వ్యతిరేకత పెరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నదని, ఏ క్షణమైనా పేక మేడలా కుప్పకూలి పోవచ్చని ఆయన జోష్యం చెప్పారు.
పశ్చిమబెంగాల్లో బీజేపీకి ప్రజల మద్దతు ఏమాత్రం లేదని శంతను సేన్ చెప్పారు. కుట్రలు, కుతంత్రాలతో కుళ్లు రాజకీయాలు చేసే బీజేపీ నాయకులు రాబందుల లాంటి వాళ్లని ఆయన వ్యాఖ్యానించారు. వర్గాల నడుమ చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి మురికి రాజకీయాలే బీజేపీ నేతల బతుకని సేన్ మండిపడ్డారు.