గాంధీ, నెహ్రూ పరచిన బాటలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా నడుస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఎవరైతే మతాన్ని తమ రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారో, వారు రాహుల్ను చూసి ఈర్ష్య పడుతున్నారని, భయపడుతున్నారని పరోక్షంగా బీజేపీని దెప్పిపొడిచారు. భయం అన్న పదాన్ని దగ్గరికి రానివ్వకపోవడం, ధైర్యంతో పోరాడే లక్షణాలున్న కుటుంబ నేపథ్యం నుంచి రాహుల్ గాంధీ వచ్చారని ఆయన పేర్కొన్నారు. అజ్మీర్ దర్గ పేలుళ్ల లో ఇంద్రేశ్ కుమార్ పేరు కూడా ఉందని, ఈ విషయం తనకు బాగా తెలుసని, మోదీ ప్రభుత్వం రావడం వల్ల శిక్ష పడలేదని, లేదంటే కచ్చితంగా శిక్ష పడేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.