న్యూఢిల్లీ, ఆగస్టు 22: మన శత్రు దేశాలైన చైనా, పాక్లు 5, 6వ తరం జెట్ విమానాల వైపు దూసుకుపోతుంటే మనం 4వతరం జెట్ల వైపే అడుగులు వేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వదేశీ తేజ్ జెట్ ఫైటర్ ప్రాజెక్టుపై ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2030ల మధ్య కాలంలో అవి గణనీయ సంఖ్యలో సేవల్లోకి దిగినా, ముందు వరుస పాత్రలో కార్యాచరణగా ఉపయోగకరంగా ఉండకపోవచ్చునని పేర్కొన్నారు.
యూఎస్ ఎఫ్-22 లేదా చైనీస్ జే-20 నాటి ఐదో తరం ఫైటర్ జెట్లను సెన్సార్ ఫ్యూజన్, ఆయుధాల అంతర్గత క్యారేజ్తో రాడార్పై ట్రాక్ చేయడం కష్టతరమవుతుందని తెలిపారు. ఇక చైనా రూపొందించిన ఆరోతరం యుద్ధ విమానాలైన జే-36, జే-50 డ్రోన్ వింగ్మెన్లతో ఏఐతో నడిచే స్వయంప్రతిపత్తిని జోడించి స్టెల్త్ ఫౌండేషన్పై నిర్మించారన్నారు.