నుహ్: బీజేపీ పాలిత హర్యానాలోని నుహ్లో మరోసారి ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. పట్టణంలోని ఓ మసీదు సమీపంలో గుర్తుతెలియని దుండగులు రాళ్లు విసిరిన ఘటనలో ఎనిమిది మంది మహిళలకు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొన్నదని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కొంతమంది మహిళలు ఓ బావి వద్ద పూజలు చేసుకొనేందుకు వెళ్తున్నారు. వారు మసీదు సమీపానికి వచ్చేసరికి, వారిపై దుండగులు రాళ్లు రువ్వారు. స్థానిక మదరసాకు చెందిన పిల్లలే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిర్యాదు వచ్చిందని నుహ్ జిల్లా ఎస్పీ నరేందర్ బిజార్నియా పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జూలై 31న నుహ్లో వీహెచ్పీ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకొన్న ఘర్షణల్లో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.